ETV Bharat / state

Tidco houses: పల్నాడు జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపీణీ.. మొదటగా 500 మందికి అందజేత

author img

By

Published : May 24, 2023, 9:46 PM IST

Updated : May 25, 2023, 1:51 PM IST

Tidco houses distribution program : పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన లబ్ధిదారులకు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పాల్గొని..లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..పేదల సొంతింటి కలను సాకారమయ్యేలా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టిడ్కో ఛైర్మన్‌ ప్రసన్న కుమార్‌ పాల్గొన్నారు.

పల్నాడు జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపీణీ.. మొదటగా 500 మంది లబ్ధిదారులకు అందజేత
Tidco houses distribution program

Tidco houses distribution program: తెలుగుదేశం హయాంలో అరకొర సౌకర్యాలతో తుతూమంత్రంగా నిర్మించిన టిడ్కో ఇళ్లకు.. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. పేదల కలకు సాకారం అందించేలా పక్కా ఇళ్లు అందించామని మంత్రి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లబ్ధిదారులకు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గత టీడీపీ హయాంలో నిర్మించిన 1504 ఇళ్లలో మొదటగా 500 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలు పంపిణీ చేశారు.

పల్నాడు జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపీణీ.. మొదటగా 500 మంది లబ్ధిదారులకు అందజేత

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, మంత్రి ఆదిమూలపు సురేష్. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్, మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడారు. మొదటగా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ పట్టణంలోని పేదలకు సొంతిళ్లు అనేది ఒక కలగా మిగిలిపోయిందన్నారు. ఆ కలను సాకారం చేసేలా ప్రభుత్వం డిడ్కో ఇళ్లను తీర్చిదిద్ది పేదలకు అందించే కార్యక్రమాన్ని చేబట్టి లబ్ధిదారులకు అందించడం జరిగిందని అన్నారు. అయితే నరసరావుపేటలో ఏర్పాటు చేసిన 1504 ఇళ్లలో మొదటగా 500 మంది లబ్ధిదారులకు పక్కా ఇళ్లను అన్ని హంగులతో ఇస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో పేదలకు పక్కా ఇళ్లు అందిస్తామని టిడ్కో ఇళ్లను అరకొర సదుపాయాలతో నిర్మించి పేదలను మోసం చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టిడ్కో ఇళ్లను పరిపూర్ణంగా ముస్తాబు చేసి అన్ని వసతులతో పేద ప్రజలకు అందిస్తున్నట్లు కొనియాడారు. కార్యక్రమంలో టిడ్కో లబ్ధిదారులు, ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశలో ఒక్క రూపాయికే మూడు వందల చదరపు అడుగుల ఇళ్లను ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటితో పాటు అన్ని రకాల ఇళ్లకు పరిపూర్ణంగా రాయితీలు ఇస్తున్నటు వంటి పరిస్థితిలో ఉన్నాం.. గత ప్రభత్వం హయాంలో పేదలకు పక్కా ఇళ్లు అందిస్తామని ఇళ్లను అరకొర సదుపాయాలతో నిర్మించి పేదలను మోసం చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఇళ్లను పరిపూర్ణంగా ముస్తాబు చేసి సిమెంట్​ రోడ్లు, కరెంటు, నీటి వసతితో ఇస్తున్నాం అని చెప్పడానికి.. చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.- ఆదిమూలపు సురేష్, మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : May 25, 2023, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.