TDP-JanSena Discussion on Crop Losses: విజయవాడలో జరిగిన తెలుగుదేశం-జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశంలో.. ఇరు పార్టీల నేతలు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, రైతులు పడుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలు కీలక తీర్మానాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా.. దేవుడి దయతో అంతా బాగుందని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమని..టీడీపీ, జనసేన పార్టీల నేతలు ధ్వజమెత్తారు.
TDP-JanSena Resolutions on Drought: రాష్ట్రంలో తాండవ చేస్తున్న కరవు పరిస్థితులపై ఐకాస భేటీలో నిర్ణయించిన తీర్మానాలను టీడీపీ-జనసేన నేతలు వెల్లడించారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..''రాష్ట్ర వ్యాప్తంగా కరవు కళ్ల ముందే కనిపిస్తున్నా అధికార పార్టీ నాయకులు అంతా బాగుందని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఖరీఫ్లో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడం వాస్తవం కాదా..?. కరవుతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాగునీరు ఇవ్వకే.. పశ్చిమ కృష్ణా డెల్టాలో పంటలు దెబ్బతిన్నాయి. సాగునీరు విడుదల, కాల్వల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. కరవు మండలాలను ప్రకటించాల్సిన బాధ్యతను విస్మరించారు. నిబంధనల మేరకు లెక్కిస్తే 449 కరవు మండలాలుగా ప్రకటించాలి. కరవు మండలాలుగా 103 మాత్రమే గుర్తించడం రైతులను మోసగించడమే.'' అని ఇరుపార్టీల నేతలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహించారు.
ఉమ్మడి మేనిఫెస్టో, 100 రోజుల ప్రణాళిక దిశగా టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
TDP-Janasena Leaders Fire on CM Jagan: రాష్ట్రంలో వర్షాభావం, సాగునీరు అందని వాటిని కరవు ప్రాంతాలుగా గుర్తించాలని టీడీపీ-జనసేన నేతలు డిమాండ్ చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వెంటనే పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే కరవు మండలాల్లో పర్యటించి.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. ఇన్స్యూరెన్స్ మీద ఉన్న అయోమయాన్ని తొలగించాలని... ఇన్స్యూరెన్సును తక్షణమే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
'చంద్రబాబు ఇమేజ్ను దెబ్బతీసేందుకు వైసీపీ దొంగ లేఖ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం దూరం'
''ఈరోజు విజయవాడలో జరిగిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో ఇరు పార్టీల సమన్వయం కోసం ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఉమ్మడి పోరాట ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. భవిష్యత్తుకి గ్యారెంటీ పేరుతో ఇరు పార్టీలు కలిసి మ్యానిఫెస్టోని ఇంటింటికి చేరే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నాం. సైకో పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా పని చేయాలని కమిటీలో నిర్ణయించాం.''-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
17 నుంచి టీడీపీ-జనసేన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం: అచ్చెన్నాయుడు