ETV Bharat / state

విశాఖకు కార్యాలయాల తరలింపును వ్యతిరేకిస్తూ పిటిషన్‌ - విచారణ వాయిదా వేసిన హైకోర్టు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 4:46 PM IST

hc_hearing_on_cm_camp_office_petition
hc_hearing_on_cm_camp_office_petition

HC Hearing on CM Camp Office Move to Visakha Petition: సీఎం క్యాంప్ కార్యాలయాల తరలింపు, పరిపాలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైనా పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

HC Hearing on CM Camp Office Move to Visakha Petition: ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం క్యాంప్‌ కార్యాలయాలను విశాఖకు తరలించడంపై దాఖలైనా పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) విచారణ జరిపింది. విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్‌ శ్రీరామ్ కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషన్‌కు విచారించే అర్హత లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్‌గా దాఖలు చేశారని, ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని అడ్వకేట్ జనరల్‌ శ్రీరామ్‌ వాదించారు. దీంతో జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. అడ్వకేట్ జనరల్‌, పిటిషనర్ల అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

అసలు ఏం జరిగిందంటే: నవంబరు 22వ తేదీన సీఎం క్యాంప్ కార్యాలయాల తరలింపు, పరిపాలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 2283ను విడుదల చేసింది. ఆ జీవోలో దసరా అనంతరం విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్‌ అధికారులకు ట్రాన్సిట్‌ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమించినట్లు పేర్కొంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షల కోసం సీఎం జగన్‌ విశాఖలో బస చేయాల్సి ఉన్నందున క్యాంప్‌ ఆఫీసు, బస గుర్తింపు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, దసరా నుంచి సీఎం జగన్ విశాఖ నుంచే పరిపాలన చేయనున్నారని తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖ రుషికొండ బీచ్ కఠిన నిబంధనలను చవిచూడక తప్పదా?

Petition in High Court against State Govt Go: ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ, సమీక్ష పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్‌ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం డిసెంబర్ 5వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతే అంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ సచివాలయం నుంచి కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రుషికొండ తవ్వకాలపై హైకోర్టులో విచారణ - డిసెంబర్‌ 27కు వాయిదా

Petition Details: మిలేనియం టవర్స్‌ను ప్రభుత్వ కార్యాలయాలకు అనువుగా మార్చడాన్ని ఐటీ పాలసీని ఉల్లంఘించడంగా న్యాయస్థానం ప్రకటించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. వీటితోపాటు విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌) ప్రాంగణాన్ని ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చడం ఎన్‌ఎంసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని, జీవో 2283ని తక్షణమే నిలుపుదల చేసి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో సీఎం క్యాంప్ కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైనా పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

CM residence on Rushikonda: రుషికొండపై సీఎం కార్యాలయం కోసం కళింగ బ్లాక్‌.. నివాసం కోసం విజయనగర బ్లాక్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.