ETV Bharat / state

AP Sadhu Parishad: ఆలయాల నిర్వహణ హిందూ సంస్థలకు అప్పగించాలి: శివానంద స్వామి

author img

By

Published : May 10, 2023, 6:05 PM IST

AP Sadhu Parishad: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను, ఆచారాలను మంటగలుపుతున్నారని.. ఏపీ సాధు పరిషత్‌ ఆరోపించింది. సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ధార్మిక సదస్సుకు వివిధ జిల్లాల నుంచి పీఠాధిపతులు, మతాధిపతులు, సాధువులు హాజరయ్యారు.

AP Sadhu Parishad
AP Sadhu Parishad

సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ధార్మిక సదస్సు

AP Sadhu Parishad: రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని.. నాలుగేళ్లుగా హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను, ఆచారాలను మంటగలిపారని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ ఆరోపించింది. సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడలో ధార్మిక సదస్సు నిర్వహించారు. వివిధ జిల్లాలనుంచి పీఠాధిపతులు, మతాధిపతులు, సాధువులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సాధు పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు శివానంద సరస్వతి, మాజీ అధ్యక్షులు వాసుదేవా నందగిరి స్వామి, విరాట్‌ హిందూ సంఘం అధ్యక్షులు రామ చంద్రమూర్తి, తురగా శ్రీరామ్‌ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

దేవాదాయశాఖను పూర్తిగా రద్దు చేయాలి.. హిందూ దేవాలయాలను వెంటనే ప్రభుత్వం నుంచి తప్పించి పీఠాధిపతులు, మతాధిపతులు, హిందూ సంస్థలకు అప్పగించాలని, దేవాదాయశాఖను పూర్తిగా రద్దు చేయాలని పీఠాధిపతులు, మతాధిపతులు హిందూ సంస్థలకు ఆలయాల నిర్వహణ అప్పగించాలని తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో దేవాదాయశాఖను రద్దు చేసి దేవాలయాలను హిందూ ధార్మిక శాఖకు అప్పగించాలని.. మేనిఫెస్టోలో పెట్టే పార్టీలకే తాము మద్దతిస్తామని తెలిపారు. గోసంరక్షణ, గోశాలల నిర్వహణను పీఠాధిపతులు, మతాధిపతులు, హిందూ సంస్థలకు ఒక్కొక్కరికీ రెండెకరాల స్థలం కేటాయించి అప్పగించాలని తీర్మానించారు. నాలుగేళ్లలో వందల సంఖ్యలో హిందువుల ఆలయాలపై దాడులు జరిగి దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసినా ఇంత వరకూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తిరుమలలోకి మద్యం వెళ్తుంది.. ఇప్పుడు ఏకంగా గంజాయి వెళ్తుంది.. కానీ ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు అరికట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నీరు ఉత్సవంగా సింహాచలం చందనోత్సవం.. సతీసమేతంగా హాజరుకావాల్సిన ఉత్సవాలకు కూడా ముఖ్యమంత్రి ఒంటరిగా వెళ్లడం హిందూ ధర్మాన్ని అగౌరవ పరచడమేనని విమర్శించారు. ఇటీవల జరిగిన సింహాచలం చందనోత్సవం.. భక్తులకు కన్నీరు ఉత్సవంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతతో విరాజిల్లాల్సిన దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా హిందూ ధర్మాన్ని మంట కలుపుతున్న ప్రభుత్వం ఈ నెల 12 నుంచి రాజ శ్యామల యాగం చేయిస్తుండటం ఎవరి కోసమని ప్రశ్నించారు. ఈ యాగానికి దేవాదాయశాఖ నిధులే వెచ్చిస్తున్నారని.. జనం కోసం కాకుండా ముఖ్యమంత్రి జగన్‌ కోసం చేసే యాగంగా సాధుపరిషత్‌ సభ్యులు అభివర్ణించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని మతాలను సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. అయితే అన్ని మతాలను జగన్​ సమానంగా చూస్తున్నారా లేదా.. హిందువులు ఆయనకు చేసిన అన్యాయం ఏంటి.. ఓట్లు వెయ్యడమా.. ఈ రాష్ట్రంలో ఏన్ని ఆలయాల మీద దౌర్జన్యాలు జరిగాయి.. ఏన్నో దుర్ఘటనలు జరిగాయి. కానీ వాటి మీద కనీసం చర్యలు తీసుకోలేదు.- శివానంద సరస్వతి స్వామి, సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.