ETV Bharat / state

జీ-20పై ప్రధాని నిర్వహించే అఖిలపక్ష భేటీకి.. సీఎం జగన్​, టీడీపీ అధినేత చంద్రబాబు

author img

By

Published : Dec 5, 2022, 8:47 AM IST

Updated : Dec 5, 2022, 9:05 AM IST

All Party Meet on G20 Presidency ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అఖిపక్ష సమావేశానికి సీఎం జగన్​, చంద్రబాబునాయడు హాజరుకానున్నారు. దీనికోసం వీరిద్దరూ దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఎప్పుడు ఎవరు ఎలా వెళ్తున్నారంటే..

Jagan CBN
జగన్​ చంద్రబాబు

All Party Meet on G20 Presidency ముఖ్యమంత్రి జగన్‌, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేడు వేర్వేరుగా దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే జీ-20 సదస్సు నిర్వహణపై.. రాజకీయ పార్టీల అధ్యక్షులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు కొనసాగే ఈ సమావేశం.. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు.

ఏ సమయానికి వెళ్తున్నారంటే.​ సీఎం జగన్ మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. మధ్యహ్నం 3 గంటల 15 నిమిషాలకు దిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం తిరిగి రాష్ట్రానికి బయల్దేరి రానున్నారు. అయితే టీడీపీ అధినేత ఉదయం 9గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి దిల్లీ వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం 5గంటలకు నిర్వహించే భేటిలో ఆయన పాల్గొననున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 5, 2022, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.