ETV Bharat / state

విజయవాడలో సీఈసీ పర్యటన - వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 8:33 AM IST

Central_Election_Commission_Team_Visit_Vijayawada
Central_Election_Commission_Team_Visit_Vijayawada

Central Election Commission Team Visit Vijayawada: ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్సీపీ అమలుచేస్తున్న కుట్రలకు అంతే లేకుండా పోతోంది. ఊహకు అందని విధంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతోంది. వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు మరో ఇద్దరు కమిషనర్లతో కూడిన బృందం ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడలో పర్యటించనుంది. ఎన్నికల సన్నాహక సమావేశమని చెబుతున్నా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జాబితాలో అక్రమాలు, అవకతవకలు జరగడంపై ప్రశ్నించేందుకే సీఈసీ బృందం వస్తున్నట్లు సమాచారం.

విజయవాడలో సీఈసీ పర్యటన - వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?

Central Election Commission Team Visit Vijayawada : ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్ల తొలగింపు, తమకు అనుకూలంగా భారీగా దొంగ ఓట్లు చేర్చడాన్ని అధికార పార్టీ ఉద్యమంలా కొనసాగిస్తోంది. బీఎల్వోలుగా (BLO) వ్యవహరిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై పెత్తనం చలాయిస్తూ తాము అనుకున్నట్లు ఓటర్ల జాబితా తయారయ్యేలా పన్నాగం అమలు చేస్తోంది. వీటన్నింటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ బృందం ఈనెల 9, 10 తేదీల్లో విజయవాడలో పర్యటించనుంది. అన్నిజిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రెండు రోజులు సమీక్ష జరపనుంది. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది.

ECI Officers to Visit State on January 9th : టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారు. ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు లేకుండా చేశారు. దశాబ్దాల తరబడి ఒకేచోట ఉండేవారి పేర్లు తీసేశారు. బతికున్నవారి ఓట్లు గల్లంతు చేసి చనిపోయిన వారివి కొనసాగించారు. ఒకే కుటుంబంలో కొందరి ఓట్లు ఒక పోలింగ్ కేంద్రంలో, మరికొందరివి వేరే కేంద్రంలో చేర్చారు. తప్పుడు సమాచారంతో అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తులు చేయించారు. ఉరవకొండ, పర్చూరు, విశాఖ తూర్పు, గుంటూరు పశ్చిమ, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి అక్రమాలు అనేకం వెలుగు చూశాయి.

దొంగ ఓట్లపై వైసీపీ గురి - ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలు

Irregularities in Voter list : పర్చూరులో తప్పుడు సమాచారంతో ఫాం-7లు పెట్టిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫిర్యాదులిచ్చినా పట్టించుకోలేదు. చివరికి ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే తప్ప బాధ్యులపై కేసులు నమోదు చేయలేదు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుదీ ఇదే పరిస్థితి. ఉరవకొండలో ఓట్ల తొలగింపుపై పయ్యావుల కేశవ్ దిల్లీ వెళ్లి సీఈసీకి ఫిర్యాదిస్తే తప్ప కదల్లేదు.
Fake Votes : వైఎస్సార్సీపీకి అనుకూలంగా వేలసంఖ్యలో దొంగ ఓట్లను చేర్పించారు. తిరుపతి నియోజకవర్గంలో 38,396 మంది ఓటర్లు శాశ్వతంగా వెళ్లిపోయినా వారి పేర్లు మాత్రం జాబితాలోనే ఉన్నాయి. చంద్రగిరిలో ఇలాంటివి 12,074 ఓట్లున్నాయి. చంద్రగిరిలో కొత్తగా ఓటు నమోదుకు 9 నెలల్లో 50వేల ఫాం-6లు పెట్టారు. తమిళనాడు వాసులను ఇక్కడ చిరునామాలతో ఓటర్లుగా చేర్పించారు.

లెక్కలేనన్ని అక్రమ ఓట్లు : రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే తరహా కుట్రలు అమలు చేశారు. తాడికొండ నియోజకవర్గ జాబితాలో తమిళనాడు వాసులకు ఓట్లున్నాయి. కాకినాడ, తిరుపతి చిరునామాలతో రాజంపేట నియోజకవర్గ జాబితాలో పేర్లు చేర్చారు. ఒకే డోర్ నంబరుతో పదులకొద్దీ ఓట్లు చేర్పించారు. మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించట్లేదు. శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లూ కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరికి రెండు, మూడు ఓట్లున్నాయి. వీటిని తొలగించాలని తెలుగుదేశం పదేపదే ఫిర్యాదులిచ్చినా ఫలితం లేదు.

ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కావడం లేదు - ఓటర్ల జాబితాలో అక్రమాలు : ఎంపీ గల్లా జయదేవ్‌

మొత్తం జాబితాల్లో అవకతవకలు : ఉమ్మడి జిల్లాకొకటి చొప్పున ఓటర్ల జాబితాలను ఈనాడు బృందాలు డిసెంబరులో పరిశీలించగా పలు అక్రమాలు వెలుగు చూశాయి. 10,209 ఓట్లు పరిశీలించగా వాటిలో 1,047 అంటే 10.25 శాతం ఓట్లకు సంబంధించి అవకతవకలు ఉన్నట్లు తేలింది. ఒక్క శాతం ఓట్ల తేడాతో అధికార పీఠాలు మారిపోతాయి. అలాంటిది నమూనాగా పరిశీలిస్తేనే 10.25శాతం ఓట్లలో అక్రమాలు బయటపడ్డాయంటే మొత్తం జాబితాల్లో అవకతవకలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది.

అజమాయిషీ చలాయిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు : ఓటర్ల జాబితా తయారీ, సవరణ బాధ్యతల్లో బీఎల్వోలుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. వీరిపై వైఎస్సార్సీపీ నాయకులు అజమాయిషీ చలాయిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలు వైఎస్సార్సీపీ జాబితాల్లా మారిపోతున్నాయి. వీటన్నింటిపై సీఈసీ బృందం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

ఓట్ల జాబితాలో వైఎస్​ఆర్​సీపీ నాయకుల అక్రమాలు - బతికుండగానే చనిపోయినట్టు తొలగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.