ETV Bharat / state

దంపతుల మధ్య వివాదం.. ఉరి వేసుకొని భార్య ఆత్మహత్య!

author img

By

Published : May 30, 2022, 10:42 PM IST

a Married woman suicide in Vijayawada
దంపతుల మధ్య వివాదం

Woman Suicide at Vijayawada: దంపతుల మధ్య వివాదం.. వివాహిత ఆత్మహత్యకు దారితీసింది. భర్తతో గొడవ కారణంగా.. విజయవాడ సత్యనారాయణపురంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసు కవిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

Conflict between the couple: ఎన్టీఆర్​ జిల్లా విజయవాడ సత్యనారాయణపురంలో ఓ వివాహిత కవిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సయమంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. కవిత ఆత్మహత్యకు దంపతుల మధ్య జరిగిన వివాదమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. కవిత-సంగమేశ్వరరావు దంపతులు సత్యానారాయణపురంలో నివాసముంటున్నారు. కవిత గ్రామ సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు.

అయితే భర్త సంగమేశ్వరరావు.. మరో మహిళతో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కూడా ఈ విషయమై దంపతులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆర్ధరాత్రి సమయంలో భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగా.. సదరు మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.