కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలికి చెందిన సురేష్ గురువారం ఉత్తరాఖండ్లోని రుడుగైర పర్వతాన్ని అధిరోహించాడు.
యువకుడికి అభినందన..
ఎంతో కాలంగా ట్రెక్కింగ్లో సాధన చేస్తున్న ఆ యువకుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో స్థానికులు ఆ యువకుడ్ని అభినందిస్తున్నారు. తగిన ప్రోత్సాహం ఉంటే మరింతగా ముందుకు సాగుతానని ఆ యువకుడు వెల్లడించారు.