ETV Bharat / state

ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఇద్దరు మృతి

author img

By

Published : Aug 28, 2021, 9:16 AM IST

Updated : Aug 28, 2021, 2:26 PM IST

ఘోర ప్రమాదం... రైలు ఢీకొని ఇద్దరు మృతి
ఘోర ప్రమాదం... రైలు ఢీకొని ఇద్దరు మృతి

09:13 August 28

కోస్గి-ఐరన్‌గల్‌ రైల్వేట్రాక్‌పై ఘటన

కర్నూలు జిల్లా కోస్గి మండలం ఐరన్​గల్ సమీపంలో  రైలు ప్రమాదం జరిగింది. ఆస్పరి మండలం బిణిగేరి గ్రామానికి చెందిన రైతులు.. వర్షాల కోసం మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో గంగ పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. 426 మైలు రాయి వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా.. వేగంగా వచ్చిన రైలు వారిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

మృతులు ఆంజనేయ, శ్రీనివాసులుగా రైల్వే పోలీసులు గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

Accident: ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌..నిద్రలోనే తండ్రి, కుమారుడు

Last Updated : Aug 28, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.