ఎయిడెడ్ పాఠశాలల మూసివేత ప్రకటనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు నగరంలోని జొహరాపురం ఎస్ఆర్సీసీ మోడల్ స్కూలుకు రావొద్దంటూ నిర్వాహకులు విద్యార్థినులకు టీసీలు ఇచ్చి పంపేశారు. దీంతో వీరందరూ ఇందిరాగాంధీ మున్సిపల్ పాఠశాలలో చేరేందుకు వచ్చారు. ఇప్పటికే సీట్లన్నీ నిండిపోయాయని, కింద కూర్చునే పరిస్థితి ఉండటంతో చేర్చుకోలేమని ఉపాధ్యాయులు చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు.
7, 9వ తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులు డీఈవో కార్యాలయానికి టీసీలతో వచ్చారు. కింద కూర్చోనైనా చదువుకుంటామని, మమ్మల్ని స్కూల్లో చేర్చుకోవాలంటూ వారు ప్రాధేయపడుతున్నారు. డీఈవోను కలిసేందుకు మంగళవారం కార్యాలయానికి వచ్చినవారు.. అక్కడ ఉపాధ్యాయులు ధర్నా చేస్తుండడంతో ఆయన్ను కలిసే వీలు లేకుండాపోయింది.
ఇదీ చదవండి: