ETV Bharat / state

రౌడీషీటర్ రాజశేఖర్ హత్య కేసు.. ఆరుగురు అరెస్టు

author img

By

Published : Mar 31, 2021, 7:08 PM IST

six members arrested in murders case
రౌడీషీటర్ రాజశేఖర్ హత్య కేసులో ఆరుగురు అరెస్టు

రౌడీషీటర్ రాజశేఖర్ హత్య కేసులో.. ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

ఈ నెల 24న కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన రౌడీషీటర్ రాజశేఖర్ హత్య కేసులో.. ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారిలో ఉన్నాడు. రాజశేఖర్​కు.. అతని బంధువైన సంజీవకుమార్ అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు ఉండేవని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారికి మనస్పర్థలు వచ్చాయన్నారు.

ఎలాగైనా రాజశేఖర్ ను హత్య చేయాలని భావించిన సంజీవకుమార్... మరో ఆరుగురితో కలిసి ప్రణాళిక ప్రకారం హతమార్చాడు. వారిలో సంజీవకుమార్​తోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. కేసు విచారణ జరుగుతోందన్నారు.

ఇవీ చూడండి:

పంచలింగాల చెక్​పోస్టు వద్ద 32.3 కిలోల వెండి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.