ETV Bharat / state

పాదరక్షల కౌంటర్లో భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం

author img

By

Published : Oct 13, 2020, 5:22 PM IST

shivalingam on receipt given to devotees
పాదరక్షల కౌంటర్లో భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం

మహానంది ఆలయంలో పాదరక్షలు భద్రపరుచినందుకు భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం చిత్రాన్ని ముద్రించారు. కొందరు భక్తులు గమనించి విషయాన్ని అధికారులకు తెలిపారు. వాటి స్థానంలో వేరే రశీదులను ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా మహానంది ఆలయం బయట పాదరక్షలు భద్రపరుచినందుకు భక్తులకు ఇచ్చే రశీదుపై శివలింగం చిత్రం ఉండటం వివాదాస్పమైంది. ఆలయానికి వచ్చే భక్తులు పాదరక్షలు కౌంటర్లో వదిలి వెళ్తారు. అందుకు ఓ రశీదు ఇస్తారు. దానిపై శివలింగం చిత్రాన్ని పొందుపరిచారు. కొందరు భక్తులు గమనించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటి స్థానంలో వేరే రశీదులను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: రైతులు భూములను మంత్రి తిరిగి ఇచ్చేయాలి: రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.