రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు జగనన్న కాలనీలను ఆదర్శంగా ఏర్పాటుకు కృషి చేస్తానని కర్నూలు జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బాధ్యతలు చేపట్టిన నరపురెడ్డి మౌర్య అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం నిర్వహించుటకు గాను సర్కార్.... తనను జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్)గా నియమించిందన్నారు. ప్రభుత్వ ఆశయాలను విజయవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో వారికి గృహాలు కూడా ప్రభుత్వమే నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా కర్నూలులో 98 వేల ఇళ్ల నిర్మాణం 2022 వ సంవత్సరానికి వీటిని పూర్తి చేయనున్నామన్నారు. ఇంటి నిర్మాణాలలో నిరుపేదలకు ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఇవీ చదవండి