ETV Bharat / state

వాగు దాటలేక... ఆసుపత్రికి చేరలేక... మధ్యలోనే వ్యక్తి మృతి

author img

By

Published : Sep 27, 2020, 4:09 PM IST

గుండెపోటుకు గురైన ఓ వ్యక్తిని వాగు దాటించి... ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లిలో జరిగింది.

man-died-in-heart-attack-at-brahamanapalli
బ్రాహ్మణపల్లిలో గుండెపోటుతో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఆదివారం వేకువజామున తీవ్ర గుండెపోటు వచ్చింది. బంధువులు అతడిని మంచం మీద ఉంచి ఉప్పొంగుతున్న ఒక్కిలేరు వాగును దాటేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో ట్రాక్టర్లో వెళ్లేందుకు యత్నించి విఫలమయ్యారు. చివరకు బాధిత వ్యక్తి అవతలి ఒడ్డుకు చేరలేక... మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. సరైన వంతెన లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.