ETV Bharat / state

'బాలకృష్ణ సినిమాలో పాటతో ఎంతో గుర్తింపు వచ్చింది'

author img

By

Published : Nov 27, 2022, 10:33 PM IST

Balakrishnan fans: వీర సింహారెడ్డి చిత్రంలో జై బాలయ్య పాటను పాడిన గాయకుడు కరీముల్లాను కర్నూలు జిల్లా బాలకృష్ణ అభిమానులు సన్మానించారు. బాలకృష్ణ సినిమాలో పాట పాడటం వల్ల తనకెంతో గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

జై బాలయ్య
Balakrishnan fans


Balakrishnan fans honored singer Karimullah: వీర సింహారెడ్డి సినిమాలో జై బాలయ్య పాటను పాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సింగర్ కరీముల్లా అన్నారు. బాలకృష్ణ సినిమాలో పాట పాడినందుకు కర్నూలు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు కరీముల్లాను ఘనంగా సన్మానించారు. సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న బాలకృష్ణ నూతన చిత్రం వీరసింహారెడ్డి సినిమాలో జై బాలయ్య పాటను కరిముల్లా ఆలపించారు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి తనకు ఎంతో గుర్తింపు వచ్చిందని కరీముల్లా అన్నారు. వీర సింహారెడ్డి సినిమాలో పాట పాడే అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు తమన్​కు, హీరో బాలకృష్ణకు కరీముల్లా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు జగన్, లతీఫ్, శ్రీనాథ్ సింగ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

జై బాలయ్య గాయకుడికి బాలయ్య అభిమానుల సన్మానం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.