ETV Bharat / state

కర్నూలులో పెరుగుతున్న రికవరీ రేటు

author img

By

Published : Aug 19, 2020, 8:21 AM IST

కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నా.. రికవరీ రేటు సైతం అధికంగా ఉందని అధికారులు వివరించారు.

kurnool corona update
కర్నూలులో పెరుగుతున్న రికవరీ రేటు

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కోలుకుంటున్నవారి సంఖ్య సైతం పెరగటం కొంత ఆనందించాల్సిన విషయమని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. మంగళవారం కొత్తగా నమోదైన 830 కేసులతో.. ఇప్పటి వరకు 34,782 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 27,604 మంది డిశ్చార్జ్ అయ్యారనీ.. 6,872 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి 31 మంది కరోనా నుంచి కోలుకొని.. డిశ్చార్జి అయినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: నిండుకుండలా సుంకేసుల .. దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.