ETV Bharat / state

కర్నూలులో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Jul 20, 2020, 6:25 PM IST

కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆహరధాన్యాలు తడిసిపోయాయి. ప్రభుత్వమే అదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

kurnool district
కర్నూల్ లో వర్షం.. ఇళ్లు జలమయం

కర్నూలు నగరంలో కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని మమతనగర్ లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం నీరు ఇళ్లలోకి చేరడంతో ఆహారధాన్యాలు తడిసిపోయాయని.. తమను ఎవ్వరూ పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను అదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఇదీ చదవండి బంధువులు చేయలేమన్నారు... పోలీసులు చేసి చూపించారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.