ETV Bharat / state

మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

author img

By

Published : Dec 26, 2021, 11:38 AM IST

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకే 70 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

fill-of-people-at-manthralayam-sri-raghavendra-swamy-temple
మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు... భక్తులు భారీగా తరలివచ్చారు. దేశ నలుమూలల నుంచి వచ్చినవారంతా.. దర్శనానికి పోటెత్తారు. గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా శ్రీ మఠం అధికారులు దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ స్వామివారి దర్శనానికి 70 వేలమంది తరలివచ్చారని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: RSS CHIEF: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మోహన్ భగవత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.