ETV Bharat / state

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానుకగా కపిలగోవు

author img

By

Published : Dec 16, 2020, 2:21 PM IST

శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ... రెండు లక్షలు విలువ కలిగిన కపిలగోవు, ఒక లక్ష విలువ కలిగిన కపిల కోడె దూడలను కానుకగా ఇచ్చారు. ఆలయానికి చెందిన అర్చక దంపతులు ఈ గోవులను దేవస్థానం వారికి ఇచ్చారు.

Kapilagovu
సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానుకగా కపిలగోవు

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ... రెండు లక్షలు విలువ కలిగిన కపిలగోవు, ఒక లక్ష విలువ కలిగిన కపిల కోడె దూడలను కానుకగా ఇచ్చారు. ఆలయానికి చెందిన అర్చకులు సోమరాజుపల్లి నాగరాజ శర్మ - గీతా దంపతులు, చెంచల రామిరెడ్డి - సునీతా దంపతులు, నందివెలుగు శేషగిరి రావు... వీటిని అందజేశారు. చల్లపల్లి ఎస్టేట్ అసిస్టెంట్ కమిషనర్ , కార్యనిర్వహణాధికారి జీవిడిఎన్​ లీలాకుమార్ సమక్షంలో స్వామివారికి ఈ గోవులను కానుకగా ఇచ్చారు.

ఇదీ చదవండీ...శాంతిపురంలో ఏనుగుల హల్​ చల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.