ETV Bharat / state

'విదేశీ విద్య పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి'

author img

By

Published : Dec 23, 2020, 9:47 PM IST

విదేశీ విద్య పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఎన్నికల్లో 'నేను విన్నాను, నేను ఉన్నాను' అన్న సీఎం జగన్​ విదేశాల్లో ఉన్న 350 మంది విద్యార్థులను గాలికి వదిలేశారని ఆరోపించారు.

Minority Rights Protection Committee
విదేశీ విద్య పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి

విదేశీ విద్య పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. విదేశాల్లో చదువుతున్న వారికి ప్రభుత్వం స్కాలర్ షిప్ నిలిపివేయడం వల్ల అక్కడ విద్యార్థులు... ఇక్కడ తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం జగన్​ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని...విద్యను ప్రోత్సహించవలసిన ప్రభుత్వం ఈ విధంగా చేయడం తగదన్నారు. ఎన్నికల్లో విద్యార్థులకు అండగా నిలుస్తానన్న జగన్​.. అధికారంలోకి రాగానే విద్యార్థులను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం విదేశీ విద్య ఉపకార వేతనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ...వైకాపా నేతలు సవాల్ చేసి తోక ముడిచే బ్యాచ్: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.