కృష్ణా జిల్లా పామర్రు మండలం అడ్డాడ సమీపంలో 10 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు..2 కిలోల గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. కలకత్తా నుంచి ఉయ్యూరుకు వెళ్తున్న లారీలో వీటిని గుర్తించారు. ఈ గుట్కా లోడు ఉయ్యూరుకు చెందిన వ్యాపారి కోపూరి కాంతారావును, లారీ డ్రైవర్ తిరుమారెడ్డి శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గుట్కా, రాజా ఖైనీ, మాణిక్ చంద్ను సప్లై చేసిన ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన గణేష్, హైదరాబాద్కు చెందిన లారీ యజమానిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి :