విజయవాడలో అగ్నిప్రమాదంపై ఎంపీ కేశినేని నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంలో కొవిడ్ బాధితులు మృతి చెందటంపై మాజీ హోంమంత్రి చినరాజప్ప విస్మయం చెందారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలన్నారు. అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే విజయవాడలో కొవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగిందని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. కొవిడ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించటం దురదృష్టకరమన్నారు. వైద్యం కోసం వచ్చి చనిపోవడం తీవ్ర బాధాకర మన్నారు.
ఇదీ చూడండి