కృష్ణాజిల్లా పెడన మండలం లంకల కలవగుంట గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కోలాహలంగా జరిగాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుండి 20 జట్లు పాల్గొన్నాయి. పామర్రు మండలం యలకుర్రు, పెడన మండలం లంకలకలవగుంట గ్రామ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోటీలో లంకల కలవగుంట జట్టు విజయం సాధించింది. విజేతగా నిలిచిన జట్టును స్థానిక ఎస్ఐ మురళి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అభిమన్యు అభినందించారు. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు తరలివచ్చారు.
ఇదీచదవండి