ETV Bharat / state

'ప్రజలందరికీ సమ న్యాయం అందించడంలో శక్తివంచన లేకుండా పనిచేస్తా'

author img

By

Published : Jul 15, 2021, 4:46 PM IST

SP Siddharth Kaushal
ఎస్పీ సిద్ధార్థ కౌశల్

ప్రజలందరికీ సమ న్యాయం అందించడంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. తొలిసారి గుడివాడకు వెళ్లిన ఎస్పీ.. మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేస్తానని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి గుడివాడకు వెళ్లిన సిద్ధార్థ్ కౌశల్.. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం గుడివాడ డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ఆయన్ను డీఎస్పీ సత్యానందం, సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు ఎస్పీని కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలు, బలహీనవర్గాల రక్షణ, ప్రజలందరికీ సమన్యాయం అందించే విషయాల్లో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎస్పీ స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

ఇదీ చదవండి:

బియ్యం లారీ ఆపి డబ్బులు డిమాండ్​.. ఆరుగురు విలేకరులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.