ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

author img

By

Published : Jul 3, 2020, 8:42 AM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు.

saakambariu utsavaalu started in indrakeeladri durga temple in vijayawada
దుర్గ గుడిలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో సురేశ్ బాబు, వైదిక్ కమిటీ సభ్యులు ఉత్సవాలు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈనెల 5వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

ఇవీ చదవండి...

ప్రపంచమంతా కరోనాను ఎదుర్కొంటోంది.. మనకూ ఎలాంటి మినహాయింపుల్లేవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.