ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు... వైభవంగా పుష్పార్చన

author img

By

Published : Apr 15, 2021, 9:34 PM IST

వసంత నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారి పుష్పార్చన ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా వివిధ పూలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

pushparchana program conducted in vijayawada temple
ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు

ఈ నెల 13 నుంచి తొమ్మిది రోజులపాటు నిర్వహించే వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వైభవంగా పుష్పార్చన నిర్వహించారు. ఈ వేడుక కోసం పూలు సమర్పించదలచుకున్న భక్తులు... మిగతా రోజుల్లో చిన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన పుష్పార్చన మండపం వద్ద సమర్పించాలని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

ఉదయం ఎనిమిది గంటలలోపు పుష్పాలు సమర్పించవచ్చని ఈవో చెప్పారు. పుష్పార్చన సేవలో పాల్గొనేందుకు అవసరమైన టిక్కెట్‌ను దేవస్థానం ఆర్జిత సేవ కౌంటర్ నుంచి పొందాలని సూచించారు.

ఇవీ చదవండి:

'జగన్‌ బెయిల్‌ రద్దు' పిటిషన్‌పై.. ఈ నెల 22న సీబీఐ కోర్టు విచారణ!

విశాఖలో 6 హత్యల కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.