ETV Bharat / state

ఈ ధరలతో సినిమా ప్రదర్శించలేం..థియేటర్ల ముందు యాజమాన్యాల నోటీసులు

author img

By

Published : Feb 25, 2022, 11:16 AM IST

Bheemla nayak
Bheemla nayak

Bheemla nayak: రాష్ట్రంలోని సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడంతో భీమ్లా నాయక్​ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. విస్సన్నపేటలోని ఓ థియేటర్​లో టికెట్ ధర రూ. 35 చొప్పున ఆడించలేమంటూ యాజమాన్యం చేతులెత్తేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

Bheemla nayak: కృష్ణా జిల్లాలోని పలు థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమా ప్రదర్శనపై రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్సన్నపేటలోని ఓ థియేటర్​లో టికెట్ రూ. 35 చొప్పున ఆడించలేమంటూ థియేటర్ యాజమాన్యం చేతులెత్తేయడంతో ఆందోళన చేపట్టారు.

సినిమా ప్రదర్శించాలంటూ థియేటర్ల ముందు పవన్ కల్యాణ్ అభిమానులు బారులు తీరారు. విస్సన్నపేట తిరువూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మైలవరంలో భీమ్ల నాయక్ చిత్ర ప్రదర్శనను సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం నిలిపివేసింది. తగ్గించిన టికెట్ ధరలతో నడపలేమని నిర్వాహకులు గేటుకు నోటీసులు అంటించారు.

ఇదీ చదవండి:

Bheemla Nayak Review: 'భీమ్లా నాయక్​' ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.