ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్​: అంతంత మాత్రంగానే ఉగాది

author img

By

Published : Mar 26, 2020, 9:34 AM IST

తెలుగువారి మొదటి పండుగైన ఉగాది వేడుకలు కరోనా కారణంగా అంతంత మాత్రంగానే జరిగాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఒకరిద్దరు మాత్రం ఆలయాలకు వెళ్లి పంచాంగ శ్రవణం చేశారు. ఇంకొంతమంది కుటుంబంతో కలిసి ఇళ్లలోనే పండగ చేసుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వ ఆదేశాలతో పంచాంగ శ్రవణం జరిపించారు.

no celbrations for ugadhi festival due to corona effect
అంతంమాత్రంగానే ఉగాది పండుగ

అంతంమాత్రంగానే ఉగాది పండుగ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలను అనుమతించలేదు. పంచాంగకర్త కప్పగంతుల సుబ్బరామ సోమయాజి సిద్దాంతి పంచాంగ పఠనం చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కమిషనరు ఎం.పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయంలో అర్చకులు, వేద పండితులు మాత్రమే హాజరై సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఈశ్వరాలయంలో శ్రీ వాయులింగేశ్వర స్వామీ సమేత శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవారి ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో ఉత్సవమూర్తులు ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమాలు, అభిషేకాలు చేపట్టారు. అనంతరం పంచాంగ పఠనం చేశారు.

ఇదీ చూడండి:

లాక్​డౌన్ ఎఫెక్ట్: ఇరుక్కుపోయిన తెలంగాణ కూలీలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.