కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని గణపవరం గ్రామంలో వేముల నందిని(15) అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలిక మృతికి ఆకతాయిల వేధింపులే కారణమని నందిని తల్లి ఆరోపిస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు