ETV Bharat / state

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

author img

By

Published : Aug 13, 2021, 10:46 PM IST

విజయవాడ దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. కొండపై చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. మంత్రికి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.

అమ్మవారి ఆలయం నుంచి మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో భక్తులు దర్శించుకునేందుకు గోడలపై ఏర్పాటు చేసిన అమ్మవారి అవతారాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ADIMULAPU SURESH: 'గడువులోగా విద్యాకానుక కిట్లు పంపిణీ చేయకపోతే జరిమానా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.