ETV Bharat / state

'మద్యం దుకాణం ఉద్యోగులే నిబంధనలు ఉల్లంఘించారు'

author img

By

Published : Jun 16, 2020, 4:47 PM IST

Updated : Jun 16, 2020, 5:44 PM IST

మద్యం విక్రయాల్లో ప్రభుత్వ నియమాలను అతిక్రమించి 394 మద్యం బాటిళ్లను ఒకే వ్యక్తికే విక్రయించిన ఘటన కృష్ణాజిల్లా కందులపాడులో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దుకాణ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'మద్యం దుకాణం ఉద్యోగులే నిబంధనలు ఉల్లంఘించారు'
'మద్యం దుకాణం ఉద్యోగులే నిబంధనలు ఉల్లంఘించారు'

కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కందులపాడు ప్రభుత్వ మద్యం దుకాణంలో ఒకే వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా 394 మద్యం బాటిళ్లను విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురు దుకాణ ఉద్యోగులను, కొనుగోలు చేసి రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఒక కారును సీజ్ చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. రాష్ట్ర మద్యం పాలసీ ప్రకారం ఒక వ్యక్తికి 3 బాటిళ్లను మాత్రమే విక్రయించాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. వీరిని పట్టుకోవటంలో చురుగ్గా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు అందజేశారు.

ఇదీ చదవండి: కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి కొడాలి

Last Updated : Jun 16, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.