ETV Bharat / state

'క్వారంటైన్​ నుంచి తప్పించుకుంటే కఠిన శిక్షలు'

author img

By

Published : Jul 14, 2020, 10:05 PM IST

krishna district sp talks about abroad people home quarantine
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ బాబు

క్వారంటైన్​ నుంచి తప్పించుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇతర దేశాల నుంచి జిల్లాకు వచ్చే వారు తప్పనిసరిగా హోం క్వారంటైన్​ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో హోమ్​ ఐసోలేషన్​లో ఉండి చికిత్స చేయించుకోవాలని స్పష్టం చేశారు.

ఇతర దేశాల నుంచి వచ్చిన వారు హోమ్​ క్వారంటైన్​ లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఐసోలేషన్​లో ఉండి తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ బాబు స్పష్టం చేశారు. క్వారంటైన్​ నుంచి తప్పించుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అంతకుమందు విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు హోమ్​ క్వారంటైన్​లో కొద్ది రోజులున్న పిదప ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వీరిపై మైలవరం పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి:

కరోనాతో కష్టాలు.. ఉపాధి లేక చిరు వ్యాపారుల ఆకలి కేకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.