పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడna ఉత్తమ సేవలు అందించిన 16 మంది మహిళా పోలీసులకు అవార్డులు అందజేశారు. పోలీసు సేవలు, దిశ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మహిళా పోలీసులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సచివాలయ వ్యవస్థలో, మహిళా పోలీసులు విశేష సేవలు అందిస్తున్నారని ఎస్పీ అన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలతో కలిసి ఎస్పీ కౌశల్... విందులో పాల్గొన్నారు. అవార్డులు పొందిన వారిని ఎస్పీ అభినందించారు.
ఇదీచదవండి.