ETV Bharat / state

'అనుమతులు లేకుండా పేలుళ్లకు పాల్పడితే కఠిన చర్యలు'

author img

By

Published : May 12, 2021, 8:01 PM IST

మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రబాబు
మాట్లాడుతున్న ఎస్పీ రవీంద్రబాబు

కృష్ణా జిల్లా నందిగామ పరిసర ప్రాంత క్వారీల యజమానులతో జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు సమావేశమయ్యారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించడం లేదన్న ఎస్పీ... మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలోనే బ్లాస్టింగ్ చేయాలని సూచించారు.

కృష్ణా జిల్లా నందిగామ పరిసర ప్రాంత క్వారీల యజమానులతో ఎస్పీ రవీంద్ర బాబు సమావేశమయ్యారు. క్వారీ యజమానులు నిబంధనలు పాటించడం లేదన్న ఎస్పీ... మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలోనే పేలుళ్లు చేయాలని సూచించారు. కొంత మంది ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లోనూ బ్లాస్టింగ్​కి పాల్పడుతున్నారని చెప్పారు.

మహేశ్వరి స్టోన్ క్వారీలో ఎలాంటి అనుమతులు లేని మెటీరియల్ ఉండటంపై వారిమీద క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. వారికి మెటీరియల్ సరఫరా చేసిన ఈశ్వరి ఎంటర్​ప్రైజెస్ యజమానిపైనా కేసు నమోదు చేసి.. రిమాండ్​కు పంపుతామని చెప్పారు. అనుమతులు లేకుండా పేలుళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

దేశంలోనే టాప్‌టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలి: సీఎం

'పీఎం కేర్స్​'​ నిధులతో లక్షన్నర యూనిట్ల 'ఆక్సికేర్​ సిస్టమ్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.