ETV Bharat / state

'తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'

author img

By

Published : Nov 26, 2020, 10:32 PM IST

sp comments on nivar toofan
ఎస్పీ రవీంద్రనాధ్ బాబు

కృష్ణా జిల్లాలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, తుపాను ప్రభావం వంటి ప్రధాన అంశాలపై ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సమీక్ష జరిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన అంబేడ్కర్​కు నివాళి అర్పించారు.

కృష్ణా జిల్లాలో నివర్ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నామని, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు. చల్లపల్లి పోలీస్ స్టేషన్​ను సందర్శించిన ఆయన, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అధికారులతో సమీక్ష జరిపారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆరా తీశారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు...రైతన్నల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.