ETV Bharat / state

రోడ్డుపై బురదలో నాట్లేసి..మాజీ ఎమ్మెల్యే సౌమ్య నిరసన

author img

By

Published : Oct 10, 2020, 9:11 AM IST

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినూత్నంగా నిరసన తెలిపారు. భారీ వర్షాలకు కంచికచెర్ల- మధిర రహదారిపై గుంతలు ఏర్పడి రోడ్లు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్లు బాగుచేయలేదని గుంతల్లో నాట్లేసిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య
రోడ్లు బాగుచేయలేదని గుంతల్లో నాట్లేసిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య

కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరసన చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు కంచికచెర్ల-మధిర రహదారిపై గుంతలు ఏర్పడి రోడ్లు ధ్వంసమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించట్లేదని మండిపడ్డారు. అందుకే గుంతల్లో నాట్లు వేసి వినూత్న రీతిలో నిరసన చేపట్టానని ఆమె స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.