ETV Bharat / state

ఉద్ధానం లాంటి తీవ్రమైన విషయాల్లో స్పందించేది ఇలాగేనా?

author img

By

Published : Dec 31, 2019, 7:06 AM IST

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయం తదితర వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

high-court-issued-orders-on-uddanam-kidney-problems
ఉద్ధానం లాంటి తీవ్రమైన విషయాల్లో స్పందించేది ఇలాగేనా?

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన ఇలాంటి సమస్యల విషయంలో జాప్యం చేయడానికి వీల్లేదని పేర్కొంది . సమస్య పరిష్కారానికి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తదితర వివరాలతో ప్రమాణపత్రాలు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రమాణపత్రం దాఖలు చేయాలని స్పష్టం చేసింది .తదుపరి విచారణ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా వేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి , జస్టిస్ ఎం . వెంకటరమణతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాతంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొంటూ న్యాయవాది సింహాచలం హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం ఉద్ధానం కిడ్నీవ్యాధి సమస్య పరిష్కారానికి , బాధితుల్ని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలంటూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది . తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా . .కౌంటర్లు దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువు కోరింది . దీంతో అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం . . కౌంటర్లు వేయమని ఆదేశించి ఆరువారాలు అయ్యిందని . . ఇప్పటి వరకు దాఖలు చేయకపోవడం ఏమిటిని ప్రశ్నించింది . ఇంటింటికి కిడ్నీ బాధితులు ఉన్న ఇలాంటి తీవ్రమైన విషయాల్లో స్పందించేది ఇలాగేనా అని ఆగ్రహం వ్యక్తం చేసింది . ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ఎస్ . శ్రీరామ్ కు స్పష్టం చేసింది.

ఇదీచూడండి.ఆర్టీసీ విలీనానికి మరో అడుగు... ప్రజా రవాణా ఏర్పాటు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.