ETV Bharat / state

నిండుకుండలా తమ్మిలేరు... అప్రమత్తమైన అధికారులు

author img

By

Published : Oct 14, 2020, 5:29 PM IST

కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు జలాశయానికి వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు... ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా - పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వంతెన కోతకు గురైంది.

Heavy water storage in  thammileru project with rains in krishna district
తమ్మిలేరు జలాశయం నుంచి నీటి విడుదల

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలోని తమ్మిలేరు జలాశయం నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తమ్మిలేరు జలాశయం వద్ద కృష్ణా - పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వంతెన కోతకు గురవుతోంది. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. కోతకు గురైన వంతెన స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

వర్ష బీభత్సంపై సీఎంకు చంద్రబాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.