ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలోని తమ్మిలేరు జలాశయం నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తమ్మిలేరు జలాశయం వద్ద కృష్ణా - పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వంతెన కోతకు గురవుతోంది. అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. కోతకు గురైన వంతెన స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: