కరోనా నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. కృష్ణా జిల్లా పెడనలోని ఆర్సీఎం చర్చిలో లాక్డౌన్ను ఉల్లంఘించి... సుమారు వంద మంది కలిసి సామూహిక ప్రార్థనలు చేశారని స్థానికులు తెలిపారు. కనీసం ఎలాంటి నియమాలు పాటించకుండా చాలా సేపు ప్రార్థనలు చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు, అధికారులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఆరా తీయగా కరోనాపై చర్చిలో అవగాహన కల్పిస్తున్నామని ఫాదర్ చెప్పుకొచ్చారు.
ఇవీ చదవండి