ETV Bharat / state

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా చర్చిల్లో ప్రార్థనలు

author img

By

Published : Apr 20, 2020, 7:16 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కృష్ణ జిల్లా పెడనలోని ఆర్​సీఎం చర్చిలో కొంతమంది సామూహికంగా కూడి చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా చర్చిల్లో ప్రార్థనలు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా చర్చిల్లో ప్రార్థనలు

కరోనా నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. కృష్ణా జిల్లా పెడనలోని ఆర్​సీఎం చర్చిలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి... సుమారు వంద మంది కలిసి సామూహిక ప్రార్థనలు చేశారని స్థానికులు తెలిపారు. కనీసం ఎలాంటి నియమాలు పాటించకుండా చాలా సేపు ప్రార్థనలు చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు, అధికారులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. ఈ విషయంపై ఆరా తీయగా కరోనాపై చర్చిలో అవగాహన కల్పిస్తున్నామని ఫాదర్ చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి

మానవత్వం మెండుగా.. పేదలకు దాతలు అండగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.