ETV Bharat / state

తెదేపా నేతలకు అందుబాటులోకి రాని వల్లభనేని వంశీ

author img

By

Published : Oct 30, 2019, 6:18 AM IST

ఎమ్మెల్యే వంశీతో సంప్రదింపులపై తెదేపా నేతల ఆశాభావం

తెదేపా నేతలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్​లో చికిత్స తీసుకుంటున్నారని వంశీ అనుచరుల ద్వారా సమాచారం అందింది. ఆరోగ్యం కుదుటపడిన అనంతరం తెదేపా నేతలతో మాట్లాడతారని భావిస్తున్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం నేతలకు అందుబాటులోకి రాలేదు. ఆయనను బుజ్జిగించి సమస్యను పరిష్కరించే బాధ్యత కేశినేని నాని, కొనకళ్ల నారాయణలకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వీరు వంశీని సంప్రదించే ప్రయత్నం చేయగా... హైదరాబాద్​లో వైద్య చికిత్సలో ఉన్నరనే.. సమాచారం అనుచరుల ద్వారా అందింది. వంశీ త్వరలోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం స్థానికంగా జోరు అందుకోగా... ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వంశీకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని... వైద్య చికిత్సల కారణాన్ని దాటవేత ధోరణిగా భావించలేమని నేతలు అంటున్నారు. త్వరలో తెదేపా నేతలతో వంశీ సంప్రదింపులు జరుపుతారని తెదేపా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :

కృష్ణాలో చంద్రబాబు పర్యటన.. గన్నవరంపై ఆసక్తి!

Intro:Body:

ap_vja_04_30_vamsi_no_tuch_with_tdp_dry_3064466_2910digital_1572368932_678


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.