గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం నేతలకు అందుబాటులోకి రాలేదు. ఆయనను బుజ్జిగించి సమస్యను పరిష్కరించే బాధ్యత కేశినేని నాని, కొనకళ్ల నారాయణలకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే వీరు వంశీని సంప్రదించే ప్రయత్నం చేయగా... హైదరాబాద్లో వైద్య చికిత్సలో ఉన్నరనే.. సమాచారం అనుచరుల ద్వారా అందింది. వంశీ త్వరలోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం స్థానికంగా జోరు అందుకోగా... ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వంశీకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని... వైద్య చికిత్సల కారణాన్ని దాటవేత ధోరణిగా భావించలేమని నేతలు అంటున్నారు. త్వరలో తెదేపా నేతలతో వంశీ సంప్రదింపులు జరుపుతారని తెదేపా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :