ETV Bharat / state

ACCIDENT: ఆటో బోల్తా... ఐదుగురు కూలీలకు గాయాలు

author img

By

Published : Jul 14, 2021, 5:15 PM IST

కృష్ణా జిల్లా ఘంటసాల సమీపంలో రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఘంటసాలలో ఆటో బోల్తా
ఘంటసాలలో ఆటో బోల్తా

కృష్ణా జిల్లా ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. వరినాట్లు వేసేందుకు వక్కలగడ్డ నుంచి బట్ల పెనుమర్రుకు వెళ్తుండగా... మలుపు వద్ద ఆటో అదుపుతప్పింది. పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఐదుగురికి గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం క్షతగాత్రులను చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ఘంటసాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. ఘటనపై వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి:

SUICDE ATTEMPT: యువకుడు ఆత్మహత్యాయత్నం... చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.