ETV Bharat / state

విద్యుత్​ స్తంభంపై చెలరేగిన మంటలు

author img

By

Published : May 22, 2020, 12:09 AM IST

కృష్ణాజిల్లా విజయవాడ అజిత్​సింగ్ నగర్ సమీపంలో ఓ కరెంట్ స్తంభానికి మంటలు అంటుకున్నాయి. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు తెలిపారు.

Fires on electric pillar in Vijayawada
విజయవాడలో కరెంట్ స్తంభానికి మంటలు

కృష్ణాజిల్లా విజయవాడ అజిత్​సింగ్ నగర్ సమీపంలో ఓ కరెంట్ స్తంభానికి మంటలు అంటుకున్నాయి. కరెంట్ స్తంభానికి ఉన్న వివిధ రకాల కేబుళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు రోజులుగా నగరంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో విద్యుదాఘాతం జరిగి ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్ధానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జన సంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది.

ఇదీచూడండి. విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని తెదేపా నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.