అమరావతి రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తుళ్లూరులో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను పోలీసులు అరెస్టు చేసి అమరావతి పోలీసు స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న లోకేశ్ అమరావతి స్టేషన్కు వచ్చి రైతులను పరామర్శించారు. రైతుల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టు చేశారని రైతులు లోకేశ్ వద్ద వాపోయారు. మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని.. శాసనమండలిలో ఆ బిల్లును అడ్డుకుంటామని లోకేశ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్న వైకాపా ఇప్పుడు ఎందుకు రాజధాని మారుస్తుందని ప్రశ్నించారు.
ఇవీ చదవండి