ETV Bharat / state

రుద్రహోమంతో ముగిసిన దుర్గమ్మ వసంత నవరాత్రి ఉత్సవాలు

author img

By

Published : Apr 22, 2021, 9:49 PM IST

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. జగజ్జననీ.. దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతి, రుద్రహోమంతో పరిసమాప్తం అయ్యాయి.

durgamma vasanta navaratri festives
దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వసంత నవరాత్రి మహోత్సవాలు తొమ్మిది రోజులుగా ఘనంగా నిర్వహించారు. ఈ రోజు పూర్ణాహుతి, రుద్రహోమంతో ఉత్సవాలు ముగిశాయి. విశేషమైన పుష్పార్చనలు, మూల మంత్ర హవనాలు, త్రికాలమంటప పూజలు నిర్వహించారు. ఈ పూజలు పూర్ణఫలాన్ని ఇవ్వడం కోసం మహాపూర్ణాహుతి జరిపారు. అగ్నిముఖంగా చేసే మంత్రాలతో ప్రతి క్రతువు దేవదూత రూపంలో అమ్మవారికి సమర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాదశర్మ తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని, అమ్మవారి అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: వేణుగానాలంకారంలో ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.