ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం

author img

By

Published : Apr 7, 2020, 3:00 PM IST

divya kalyanotsavam held at indrakiladri temple
ఇంద్రకీలాద్రిపై ఘనంగా దుర్గామల్లేశ్వరస్వామి దివ్య కల్యాణోత్సవం

విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి దివ్య కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా ఈ వేడుకల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై చైత్రమాస వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామి దివ్య కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. దేవస్థానం ఆశీర్వచన మండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్ బాబు, పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకను పండితులు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ ఈవో దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా భక్తులు ఆలయానికి వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆలయ కమిటీ ప్రతినిధులు మాత్రమే వేడుకకు హాజరయ్యారు.

ఇదీ చదవండి:

వైరస్​ నివారణకు శతచండీ ధన్వంతరి హోమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.