ETV Bharat / state

CORONA CASES IN SCHOOLS: ముసునూరు జడ్పీ హైస్కూల్​లో కరోనా కలకలం..

author img

By

Published : Sep 3, 2021, 10:12 AM IST

కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఐదుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరినీ హోం ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు.

corona-positiva-cases-in-musunuru-zp-high-school-at-krishna-district
ముసునూరు జడ్పీ హైస్కూల్​లో కరోనా కలకలం.. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడికీ పాజిటివ్

కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు, ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకడం కలకలం రేపింది. పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి, ఎనిమిదో తరగతికి చెందిన ఇద్దరు, పదో తరగతికి చెందిన ఇద్దరికి, ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. విద్యార్థులందరూ ముసునూరుకు చెందినవారే. ప్రభుత్వ వైద్యులు వీరికి మెడికల్ కిట్లు అందజేసి... హోం ఐసోలేషన్​లో ఉంచారు.

పాఠశాల మొత్తం శానిటైజ్ చేసి మిగతా విద్యార్థులు కూడా కరోనా పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

ఇదీ చూడండి: Fire accident: వీరపనేనిగూడెంలోని ప్లాస్టిక్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.