ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1395 కరోనా కేసులు... 9 మంది మృతి

author img

By

Published : Nov 17, 2020, 6:49 PM IST

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1395 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మహమ్మారి బారిన పడి చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. కడప, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.

ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 66 వేల 778 కరోనా పరీక్షలు చేయగా... 1395 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 56 వేల 159కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 9 మంది మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6 వేల 890కి పెరిగింది. కొత్తగా 2 వేల 293 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 16 వేల 985 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.