ETV Bharat / state

'పౌర హక్కుల సంఘాల నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి'

author img

By

Published : Apr 3, 2021, 5:59 PM IST

civil rights leaders Round table meeting in Vijayawada
విజయవాడలో పౌరహక్కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం

విజయవాడలో పౌరహక్కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సోదాల పేరుతో కేంద్ర ప్రభుత్వం సంఘాల నాయకులపై ఎన్​ఐఏతో అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.

ముంచింగిపుట్టులో పౌరహక్కుల సంఘాల నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో పౌరహక్కుల సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాల్లో సీఎల్సీ మానవ హక్కుల వేదిక, చైతన్య మహిళా కమిటీ, ప్రజా కళా మండలి తదితర సంఘాల నాయకులు, కార్యకర్తల ఇళ్లలో సోదాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏతో అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రజా సంఘాల నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ... వాటిని బేఖాతరు చేస్తూ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు.

ఇదీచదవండి.

నిప్పులు కురిపిస్తున్న సూరీడు..వడగాలులతో ప్రజలకు ఇబ్బందులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.