ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

author img

By

Published : Jun 8, 2020, 4:33 PM IST

లాక్​డౌన్​తో పనులు కొల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ సీఐటీయూ నేతలు కృష్ణాజిల్లా చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.

citu leaders protest at chellapalli krishna district
తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా

కృష్ణాజిల్లా చల్లపల్లిలో తహసీల్దార్ కార్యాలయం ముందు సీఐటీయూ నేతలు ధర్నా చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కె.స్వర్ణమేరికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.వి. గోపాలరావు, మండల సీఐటీయూ కార్యదర్శి అన్నం గగారిన్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దు చెక్​పోస్టుల వద్ద ట్రాఫిక్ జామ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.