భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కంపెనీ పది లక్షల రూపాయల విలువ చేసే ఆరోగ్య పరీక్షా యంత్రాలను పోలీసు ఆస్పత్రికి అందజేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా రక్త పరీక్ష యంత్రం, సీబీపీ, ఎక్స్ రే, ఈసీజీ, ఫిజియో థెరపీ మిషన్లను అందించారు. బెల్ డైరెక్టర్ శివకుమారన్.. కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు పరికరాలు అప్పగించారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు నిత్యం బిజీగా ఉంటారని శివకుమారన్ అన్నారు. పోలీసుల విధులు ఒత్తిళ్లతో కూడుకుని ఉంటాయని.. దానివల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయని పేర్కొన్నారు. వారి ఆరోగ్య పరీక్షలకు.. ఈ యంత్రాలు ఉపయోగపడతాయని తెలిపారు.
ఇదీ చదవండి: చెత్తకు నిప్పంటించిన ఆకతాయిలు.. మంటలను అదుపుచేసిన సిబ్బంది